తిమ్మాపూర్; బావిలో పడి యువకుడు మృతి

67பார்த்தது
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరలోకి వెళ్తే తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బత్తిని సాయి (24) అనే యువకుడు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఎల్ఎండి ఎస్సై వివేక్ చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி