రుణ మాఫీ కోసం రైతుల ఆందోళన

63பார்த்தது
జగిత్యాల అర్బన్ మండలం అంబరిపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన రుణమాఫీ అర్బన్ మండలంలో చాలా గ్రామాల ప్రజలకు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగని రైతులు బ్యాంకులకు వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్లను అడగాలని చెప్తున్నారని వాపోయారు. వ్యవసాయం వదిలి పెట్టి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని రైతులు విమర్శించారు.

தொடர்புடைய செய்தி