ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం పంపిణీ

58பார்த்தது
ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం పంపిణీ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేటకు చెందిన ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన 52 లక్షల విలువ గల 24 పరిహార చెక్కులను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేగ్యం గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరామన్నారు.

தொடர்புடைய செய்தி