ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.