మొక్కలు నాటి సంరక్షించాలి: ఎంపిడిఓ

79பார்த்தது
మొక్కలు నాటి సంరక్షించాలి: ఎంపిడిఓ
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిట్లం ఎంపిడిఓ కమలాకర్ అన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని గద్దగుండా
తండా అటవీ ప్రాంతంలో ఎంపీడీవో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రకృతి పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో శివ, పిట్లం గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி