పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న ఉద్యోగులు

60பார்த்தது
పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న ఉద్యోగులు
ఎల్లారెడ్డి తహశీల్దార్ ఆఫీస్ లో శనివారం నుండి పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ ను ఏర్పాటుచేసినట్లు జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మన్నె ప్రభాకర్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ఎండి. రహీమొద్దీన్ తెలిపారు. ఎన్నికల విధులకు హాజరు కానున్న ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించు కోవడానికి, ఈ నెల 8వ తేది బుధవారం వరకు అవకాశం ఉందని తెలిపారు.

தொடர்புடைய செய்தி