ఎరాజ్ పల్లి దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సూర అనీల్

71பார்த்தது
ఎరాజ్ పల్లి దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సూర అనీల్
బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామ సార్వజనిక్ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సూర అనీల్ ను గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ఆయన ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉండి దేవీ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం అధ్యక్షులను శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி