ఎన్నికల ప్రక్రియపై వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్పందిస్తూ జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని అన్నారు. ఏపీ ఎలాన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలి. ఆత్మస్తుతి, పరనింద మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని సోమిరెడ్డి అన్నారు.