క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచులో కూడా టీమిండియా టాస్ ఓడితేనే బాగుంటుందని క్రికెటర్ అశ్విన్ తన అభిప్రాయం తెలిపారు. ఏది ఎంచుకోవాలో కివీస్కే వదిలేయాలి అని సూచించారు. అప్పుడే భారత్ను క్లిష్టపరిస్థితులో నెట్టేసే అవకాశం కివీస్కు ఉండదని పేర్కొన్నారు. భారత్ పటిష్టంగా ఉండడంతో న్యూజిలాండ్పై మరోసారి పైచేయి సాధించి కప్పు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.