NEET ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురికి 720/720 మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తొలుత ప్రశ్నపత్రం లీకైందని, ఇప్పుడు ఫలితాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.