నాసా-ఇస్రో సంయుక్త ఆపరేషన్లో భాగంగా 2025 ఏప్రిల్ నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామిని పంపించనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ మిషన్ కోసం ఇప్పటికే ప్రధాన వ్యోమగామిగా శుభాన్షు శుక్లా, బ్యాకప్గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఉండనున్నారు. ఏఎక్స్-4 మిషన్ కోసం వీరు అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. భారతదేశం యొక్క మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ మిషన్ లక్ష్యం.