ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తాజాగా ప్రశంసలు కురిపించారు. ఆసీస్తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత భారత్ అద్భుతమైన విజయం సాధించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. స్టార్స్ లేకున్నా భారత్ గెలుస్తుందని ఆయన అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో గెలుపుతో టీమిండియా ఆ విషయాన్ని నిరూపించిందని గవాస్కర్ వెల్లడించారు. రోహిత్ కెప్టెన్సీలో CT 2025 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.