నకిలీ బంగారు నాణేలను అసలైన బంగారు నాణేలని నమ్మించి ఎక్కువ ధరకు విక్రయించాలని యత్నించిన ముగ్గురిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 5న షాద్నగర్ మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా షాద్నగర్ పోలీసులు రాయికల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ముగ్గురిని రిమాండ్కు పంపినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.