వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

81பார்த்தது
వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
నగరంలో గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసేవారు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం పలు మార్గదర్శకాలు జారీ చేశారు. దీనికోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ లింక్‌ (www.policeportal.tspolice.gov.in) మంగళవారం నుంచి పని చేస్తుందని, వచ్చే నెల 6 లోపు నిర్దేశిత ఫార్మాట్‌లో అవసరమైన పత్రాలు జోడించి దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు. సమాచారం కోసం 87126 65785కు సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி