హైడ్రా నోటీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్

63பார்த்தது
ప్రభుత్వం హైడ్రా పేరుతో ఒకటో రెండో పెద్దోళ్ల నిర్మాణాలు కూల్చారు కానీ వందలాది మంది పేదలు రోడ్డున పడుతున్నారని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ హస్మత్ పేట్ బోయిన్ చెరువును ఆయన సందర్శించారు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్న సుమారు 140 కుటుంబాలకు అధికారులు నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ పనులు చేసుకునే వారికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.

தொடர்புடைய செய்தி