లాల్ బజార్, నాగ్ మందిర్ కు పోటెత్తిన భక్తులు

76பார்த்தது
తిరుమలగిరి పరిధి లాల్ బజార్ నాగ్ మందీర్ కు శుక్రవారం భక్తులు పోటెత్తారు. నాగులపంచమి ని పురస్కరించుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి నలుమూలల నుంచి వేలదిగా భక్తులు తరలిరావడంతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పూజలు చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

தொடர்புடைய செய்தி