సికింద్రాబాద్ రానున్న బోనాల ఉత్సవ వేడుకలను శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని వారాసిగూడ ఎస్ హెచ్ ఓ సైదులు సూచించారు. వారాసిగూడ పిఎస్ లో ఆలయ కమిటీ సభ్యులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. పండుగ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ లతో సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే, కఠిన చర్యలు తప్పవన్నారు. ఎస్ఐ సుధాకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.