ఆర్డిఓకి వినతిపత్రం అందజేత

263பார்த்தது
ఆర్డిఓకి వినతిపత్రం అందజేత
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 94 నుండి 195 వరకు ఉన్న 1,188.25 ఎకరాల భూమిని స్వాతంత్రం రాకముందు నుండి కాస్తూలో ఉన్న ఎల్లమ్మతండా, బోడకొండ గ్రామాల గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి కి వినతి పత్రం బుధవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు పగడాల యాదయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం దారుణమని, వెంటనే తనకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దేవరాం నాయక్ సపావట్, సిపిఎం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రావుల జంగయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி