హరితహారం విజయవంతం చేయండి : ఎంపీపీ క్రూపేష్

162பார்த்தது
హరితహారం విజయవంతం చేయండి : ఎంపీపీ క్రూపేష్
ఎంపీపీ క్రూపేష్ ఆధ్వర్యంలో బుధవారం హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ క్రూపేష్ మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత సంవత్సరం ఒకే రోజు ఆరు లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదే విధంగా జూన్ 25 నుంచి ఆరో విడత హరితహారం మొదలవుతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

మండల పరిధిలో అన్ని గ్రామాలలోని ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని పెద్దమొత్తంలో మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఏఈ ఇంద్రసేనా రెడ్డి, ఈవో ఆర్డి మహేష్, విలేజ్ సెక్రటరీలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி