25న మహనీయుల జాతరను విజయవంతం చేయండి

57பார்த்தது
బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 25న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న మహనీయుల జాతరను విజయవంతం చేయాలని సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మహానీయుల జాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 25న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే కార్యక్రమంలో ఆట - పాట - మాట బహుజన సాంస్కృతిక ఉద్యమం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி