చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు స్వాధీనం

80பார்த்தது
చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు స్వాధీనం
చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్‌లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు రూ.10 వేలు ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி