గణేష్ నిమజ్జనం.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ

70பார்த்தது
గణేష్ నిమజ్జనం.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ
హైదరాబాద్ నగరంలో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జనం ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు (సోమవారం) పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... రాచకొండ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పదివేల మందితో భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ కట్టపై 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you