గణపయ్య విగ్రహానికి 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరణ (వీడియో)

60பார்த்தது
ముంబై శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్‌బీ సేవామండల్‌ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ మండపంలోని గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఈ వేడుకలకు రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. నేటి నుంచి సెప్టెంబరు 11 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

தொடர்புடைய செய்தி