జాతీయ విపత్తుగా ప్రకటించాలని వినతి

77பார்த்தது
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట, అస్థి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி