ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

53பார்த்தது
మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య తగ్గడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణీ స్త్రీ కి ఇక్కడే ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி