బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

56பார்த்தது
మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణ వాడి వీధిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 59వ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేశారు. ఆలయ అర్చకులు స్వామి వారి శేషవస్త్రలతో సన్మానించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్రాహ్మణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி