ప్రజల గుండెల్లో వైయస్ఆర్ సుస్థిర స్థానం: ఎమ్మెల్యే యెన్నం

69பார்த்தது
ప్రజల గుండెల్లో వైయస్ఆర్ సుస్థిర స్థానం: ఎమ్మెల్యే యెన్నం
తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, బెక్కరి అనిత, మధుసూదన్ రెడ్డి, బెనహర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி