రాష్ట్రస్థాయి ఖోఖో టోర్నీ.. ఉమ్మడి పాలమూరుకు 3వ స్థానం

54பார்த்தது
రాష్ట్రస్థాయి ఖోఖో టోర్నీ.. ఉమ్మడి పాలమూరుకు 3వ స్థానం
హైదరాబాద్ లోని మౌలాలిలో శని, ఆదివారం నిర్వహించిన 34వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా ఖోఖో పోటీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ బాల, బాలికల జట్లు మూడోస్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఒబేదుల్లా కొత్వాల్, జీఏ. విలియం పలువురు అభినందించారు. రానున్న టోర్నీల్లో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ టోర్నీలో కోచ్ లు, పీఈటీలు మహేష్, సామ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி