మెడికల్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన మున్సిపల్ ఛైర్మన్

73பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ ను మహబూబ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు. మానవుల అవయవాల పనితీరు గురించి అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షబ్బీర్ అహ్మద్, ఆసుపత్రి రెసిడెంట్ డైరెక్టర్ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி