ఇంట్లో ఆత్మ ఉందని భయపెట్టి మహిళ నుంచి రూ.30 లక్షలు కాజేసిన నలుగురు వ్యక్తులు

69பார்த்தது
ఇంట్లో ఆత్మ ఉందని భయపెట్టి మహిళ నుంచి రూ.30 లక్షలు కాజేసిన నలుగురు వ్యక్తులు
హైదరాబాద్ న్యూబోయిగూడకు చెందిన జయనందిని తల్లి జయకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. సామాజిక మాధ్యమంలో పూజలతో సమస్యలు తీరుతాయనే ప్రకటన చూసి సంప్రదించారు. పూజల బృందంలోని సభ్యులు కిన్నెరసాయి, పురాణం నివాస్, ఎర్నాల వాసు, నాగరాజులు మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోందని, పూజలు చేయకపోతే చనిపోతారంటూ భయపెట్టారు. అలా ఆగస్టు 17 నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు. జయ ఆరోగ్యం కుదుటపడకపోడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி