వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రిమాండ్‌ పొడిగింపు

60பார்த்தது
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రిమాండ్‌ పొడిగింపు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్‌ను మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రెండు రోజుల విచారణలో భాగంగా నందిగం సురేష్‌కు 45 ప్రశ్నలు వేసి పోలీసులు సమాచారం రాబట్టారు. అత్యధిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాధానం చెప్పారని సమాచారం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி