చెరువులో పడి ఐదుగురు మృతి చెందిన పెను విషాద ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో చోటుచేసుకున్నది. నాగ్భిడ్ ప్రాంతంలోని ఘోడాఝరి చెరువులో మునిగిపోయి ఐదుగురు మృతి చెందినట్లు పోలీసుకు వెల్లడించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న అనంతరం నాగ్భిడ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెతికే పనిలో పడ్డారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.