దుర్గామాత మండపం దగ్గర కాల్పుల కలకలం

77பார்த்தது
దుర్గామాత మండపం దగ్గర కాల్పుల కలకలం
బిహార్ లో దుర్గామాత మండపం వద్ద కాల్పులు కలకలం రేపాయి. బైక్‌లపై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. భోజ్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అర్హాలోని దుర్గామాత పూజా పండల్‌ వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైకులపై వచ్చారు. అక్కడున్న వారిపై గన్స్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.

தொடர்புடைய செய்தி