ఫలక్ నామా రౌడీషీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితమే మాస్ యుద్దీన్ ఓ భూవివాదంలో కొంతమందితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.