గణేష్ నవరత్రాలు వస్తే వీధి వీధినా.. ఇంకా చెప్పాలంటే.. ప్రతీ లైన్లో గణేష్ మండపాలు వెలుస్తూంటాయి. కానీ కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం ఎవరూ ఊహించని ఐక్యత చూపిస్తూంటారు. అలాంటి గ్రామం ఒకటి నల్లగొండ జిల్లాలో ఉంది. మాడ్గులపల్లి మండలం కేశవాపురం గ్రామం కాస్త పెద్దదే. వారు వినాయక చవితి విషయంలో చాలా పక్కాగా ఉంటారు. రెండో మండపం అనే అంశాన్ని అసలు పట్టించుకోరు. ఊళ్లో ఒకే విగ్రహాన్ని పెట్టుకుంటారు. మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అందరికీ పూజలకు అవకాశం కల్పిస్తారు.