IPL-2025: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై- ముంబయి మధ్య ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో CSK మాజీ సారథి ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వీల్ఛైర్లో ఉన్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్లిపోతుందని.. ఎన్నాళ్లు ఆడాలనుకుంటే సీఎస్కేకు అంతకాలం ఆడతానని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశాడు. అయితే ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత కూడా ధోనీ ఆటకు రిటైర్మెంట్ ఇవ్వరని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించారు.