అమ్మాయిల జోలికి వస్తే ఎన్‌కౌంటర్: సీఎం చంద్రబాబు

1523பார்த்தது
అమ్మాయిల జోలికి వస్తే ఎన్‌కౌంటర్: సీఎం చంద్రబాబు
గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఘటనపై విద్యార్థినిలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. అవసరమైతే ఎన్‌కౌంటర్‌కు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. అప్పుడు నేరం చేయాలనే ఆలోచన కూడా రాదని అన్నారు. నిందితులకు ఆశ్రయం కల్పించే రాజకీయ నేతలకు ఇదే శిక్ష వర్తిస్తుందని చెప్పారు. తను ప్రభుత్వంలో అమ్మాయిల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி