ఉద్యోగిని బురిడీ కొట్టించి తెలివిగా సెల్‌ఫోన్ దొంగిలించారు (వీడియో)

585பார்த்தது
ఏపీలోని ఏలూరులో సెల్‌ఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. 2 టౌన్ పట్టణ పరిధిలోని డీఎం అండ్ హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఉద్యోగిని బురిడీ కొట్టించి ఫోను దొంగలించారు. బైకుపై ఉన్న వ్యక్తి ఏదో పడిపోయిందంటూ ఉద్యోగికి చెప్పడంతో ఆయన వంగాడు. ఇంతలో పక్కన ఉన్న మరో వ్యక్తి ఆయన ఫోన్‌ను కొట్టేశాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది.

தொடர்புடைய செய்தி