ప్రతి రోజూ పైనాపిల్ పండు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. రక్తపోటు రోగులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది.