జమ్ముకాశ్మీర్లోని అఖ్నూర్లో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. మొదట ఏడుగురు మరణించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 21కి చేరింది. మరో 40 మందికి గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయని చెప్పారు. గాయపడిన వారిని అక్నూర్లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.