కాంగ్రెస్ ఎమ్మెల్యే జుబేర్ ఖాన్ మృతి.. రాహుల్ గాంధీ సంతాపం

75பார்த்தது
కాంగ్రెస్ ఎమ్మెల్యే జుబేర్ ఖాన్ మృతి.. రాహుల్ గాంధీ సంతాపం
రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జుబేర్ ఖాన్ చనిపోయారు. శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధత, అంకిత భావంతో ఆయన సేవలందించారన్నారు. ఆయన మృతి పార్టీకి పెద్ద లోటు అని పేర్కొన్నారు. రాజస్థాన్ గవర్నర్ హరిభౌ బాగ్డే, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం సంతాపం తెలిపారు.

தொடர்புடைய செய்தி