విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారి మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైంది. ప్రియాంక ముఖర్జీ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించింది. అయితే విమానంలో పాప ఏడువగా మహిళా క్యాబిన్ సిబ్బందికి అప్పగించింది. తర్వాత పాపను తన దగ్గరికి తెచ్చినప్పుడు మెడలో నుంచి చైన్ మిస్ అయినట్లు గుర్తించింది. దీంతో ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.