CCTV: పూణేలోని రూ.5 లక్షల విలువైన నగలను క్షణాల్లో దోచుకెళ్ళాడు

80பார்த்தது
పట్టపగలు ఓ యువకుడు రూ.5 లక్షల విలువైన నగలను క్షణాల్లో కొట్టేసి పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. స్కూటీ పక్కనే నిల్చున్న మహిళను బైక్ పై వచ్చిన యువకుడు దృష్టి మళ్లించగా.. పక్కన నిల్చున్న యువకుడు స్కూటీ ముందు ఉన్న నగల బ్యాగు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி