మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ ఆటో డ్రైవర్ను భార్య, కొడుకు అతి కిరాతకంగా కొట్టి చంపిన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకులు అతని తలపై చెక్క కర్రలతో కొట్టి ఆటోకు నిప్పంటించారు. ఓ ఇంటి విషయంలో కుటుంబం మధ్య గొడవలు ఈ హింసకు దారి తీశాయి. ఈ ఘటన బుధవారం జరగగా, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.