‘దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు’.. ప్రధానికి రాసిన లేఖలో మమత

50பார்த்தது
‘దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు’.. ప్రధానికి రాసిన లేఖలో మమత
దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదిత చట్టంలో చేర్చాలన్నారు. సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలని లేఖలో వివరించారు.

தொடர்புடைய செய்தி