భారత్‌లో యాపిల్‌ 16 తయారీ.. రెట్టింపైన ఐఫోన్‌ ఎగుమతులు

77பார்த்தது
భారత్‌లో యాపిల్‌ 16 తయారీ.. రెట్టింపైన ఐఫోన్‌ ఎగుమతులు
భారత్‌లో యాపిల్‌ సంస్థ ఐఫోన్ల తయారీ, విక్రయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. మన దేశం నుంచి యాపిల్‌ ఐఫోన్ల ఎగుమతులు దాదాపు రెట్టింపు ఆయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో వీటి ఎగుమతుల విలువ 5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐఫోన్‌ 16 భారత్‌లో తయారవుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. త్వరలోనే వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఐఫోన్‌ ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా.

தொடர்புடைய செய்தி