పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు

60பார்த்தது
పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లు అందించలేదన్న ఆరోపణలతో అంగన్‌వాడీ కార్యకర్త ఊర్మిళ సమాల్ పై గ్రామస్తులు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి, దుర్భాషలాడుతూ దారుణంగా కొట్టారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సమయంలో ఉద్యోగి సహాయం కోసం అభ్యర్థించారు. కానీ ఎవరూ సహాయం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி