ఏపీలోని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతల పల్లె కోటేష్ వినాయక చవితి పర్వదినం సందర్భంగా అగ్గిపెట్టెపై 60 గణనాథుడి అపురూప చిత్రాలను వేశారు. మైక్రోబ్స్తో రెండు గంటలు శ్రమించి ఈ చిత్రాలను వేశానని కోటేష్ తెలిపారు. ప్రతి వినాయక చవితికి గణనాథుడి చిత్రాలు వేస్తానని, ఈ సారి కొంచెం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో అగ్గిపెట్టెపై చిత్రాలను వేసినట్లు ఆయన పేర్కొన్నారు.