18వ లోక్సభ తొలి సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో విపక్షాల ఆందోళనల నడుమ కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ రెండో రోజు కూడా సభ్యులతో ప్రమాణం చేయించారు. లోక్ సభ సభ్యునిగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.