ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి

81பார்த்தது
ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి
ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తాంసి మండల తహసీల్దార్ లక్ష్మీ బీఎల్వోలకు సూచించారు. మండలం లోని హస్నాపూర్, పొన్నారి, తాంసి గ్రామాలలో కొనసాగుతున్న పంపిణీ ప్రక్రియను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో లక్ష్మీ మాట్లాడుతూ. వచ్చేనెల 5వ తేదీ లోగా 100 శాతం పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ దారవేణి రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி